Saturday 1 March 2014

'రాజకీయ విభజన''లో ఎవరి వాటా ఎంత..?



ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 లోక్ సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విడిపోయింది. అయితే.. వివిధ రకాల ముసుగులు వేసుకుని విభజన కార్యాన్ని పూర్తిచేసిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి పార్టీల ఇందులో వాటా ఎంత..? మొదటి నుంచీ తమ స్వార్థ, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో నాటకాలు ఆడిన ఈ పార్టీలు.. తుది వరకూ ఆటను కొనసాగించాయి. చివరకు.. ప్రజలు ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో కూడా తేల్చుకోలేని గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. కేవలం ఓట్లు, సీట్లు కోసమే జరిగిన రాష్ట్ర విభజన తంతులో ఎవరి వాటా ఎంతుందో..
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ లక్ష్యం...   రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సీమాంధ్రలో తమకు కొరకరాని కొయ్యగా మారిన జగన్ ను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీంతో.. మిగిలిన తెలంగాణలోనైనా పట్టు నిలుపుకోవాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో...See More 

నాడు వీసా రద్దు చేశారు..! నేడు గాలం వేస్తున్నారు..!! మోడీతో అమెరికా మిలాకత్ దేనికోసం..?!



నిన్నటి వరకూ నరేంద్ర మోడీకి కనీసం వీసా ఇవ్వడానికి కూడా అమెరికా ఎందుకు నిరాకరించింది..?
తన దేశపు గడప తొక్కనివ్వని అమెరికా.. ఇవాళ సప్త సముద్రాలు దాటి వచ్చి ఏకంగా ఆయనతో మీటింగు, చాటింగులకు సిద్ధమవడానికి కారణం..??
మొత్తంగా.. ఇన్నాళ్లూ అల్లంత దూరాన ఉంచిన గుజరాత్ ముఖ్యమంత్రిని నేడు అమెరికా ఆలింగనాలు చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులేంటి..???
ఇంతలో వచ్చిన అంతటి మార్పేంటి..?!
మానవ హక్కుల హననానికి పాల్పడ్డాడని...
  2002లో గుజరాత్ లో ముస్లింల ఊచకోతకు కారణమయ్యాడనే కారణంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకు అమెరికా వీసా నిరాకరించింది. నాటి నుంచి నేటి వరకూ ఆయనను అమెరికాలో అడుగు పెట్టనివ్వలేదు. ఆ దేశంలోని యూనివర్సిటీల్లో మోడీ ప్రసంగించాలని ఉవ్విళ్లూరినప్పటికీ కుదరదు పొమ్మంది. ఏం చేసైనా అమెరికాలో కాలు మోపాలని భావించిన నరేంద్ర మోడీకి రిక్తహస్తమే చూపించింది. కానీ.. అదంతా గతం...See More

కేజ్రీవాల్ జన లోక్ పాల్ పోరాటం ఫలిస్తుందా..?



అవినీతి నిర్మూలన, ఫెడరల్ వ్యవస్థ బలోపేతం చేయడమే తన లక్ష్యమని, అందుకు తన పదవినైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదేపదే చెబుతున్నారు. జనలోక్ పాల్ బిల్లును తక్షణమే ఢిల్లీ అసెంబ్లీలో పెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం, హోంశాఖతో పోరాటం చేస్తున్నారు. అయితే.. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు కేజ్రీకి కొన్ని రాజ్యాంగపరమైన అడ్డంకులున్నాయి. మరి వాటిని ఆయన అధిగమించగలరా..? కేంద్ర ప్రభుత్వం ఆయన పట్ల ఎలా వ్యవహరిస్తుంది..? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.....See More

నీ మనసు నాకు తెలుసు..! (బ్లడ్ గ్రూప్ తో అంచనా..!!)



మనకు తెలిసిన వారి మనస్తత్వం గురించి మనకు ఒక అంచనా ఉంటుంది.. వారి ప్రవర్తనపై ఓ అవగాహన ఉంటుంది.. కానీ.. మనకు పరిచయం లేని వ్యక్తుల మనసును పరిశీలించేదెలా..? వారి బిహేవియర్ ను అంచనా వేసేదెలా..?? అంటే.. దానికీ ఓ లెక్కుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక వ్యక్తిని మనం చూడకపోయినా.. కొంచెం కూడా పరిచయం లేకపోయినా.. వారు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చట..! అయితే.. దీనికి ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్ తెలిస్తే చాలు..! మన బ్లడ్ గ్రూప్ ను బట్టే మన మనస్తత్వం ఆధారపడి ఉంటుందని జపనీయులు, కొరియన్లు విశ్వసిస్తారు. కానీ.. ఇన్నిరోజులూ ఈ విషయం నిరూపించబడలేదు. అయితే.. ఇది వాస్తవమేనని తాజా అధ్యయనం తేల్చి చెబుతోంది. ఆ వివరాలు చూద్దాం...
ఓ పాజిటివ్ : ఈ బ్లడ్ గ్రూప్ కలవారు చురుకైన మైండ్ సెట్ కలిగి ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు, చొరవ, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలనే మనస్తత్వాన్ని కలిగి...See More 

నాజూకు అందం.. నాలుగు చిట్కాలతో..!



''నాజూగ్గా ఉండాలంటే.. ఎక్సర్ సైజ్ లు చేయాలి, తిండి తగ్గించాలి, జంక్ ఫుడ్స్ అస్సలు తినకూడదు, డాన్సులు చేయాలి, యోగా చేయాలి''..ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. కానీ, ఇలాంటివేమీ చేయకుండానే.. నాజూకుదనాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? భోజనం మానేయడం ద్వారా కాదు.. కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా మీ శరీరం నాజూగ్గా తయారవుతుందన్న విషయం మీకు తెలుసా..? కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్ల వల్ల శరీరం నాజూగ్గా అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. అయితే.. వీటిని సరైన కొలతలతో తీసుకోవాలి. ఆ కాంబినేషన్లు ఏంటో ఒకసారి చూద్దాం..
గ్రీన్ టీ అండ్ లెమన్...    ఈ ఫుడ్ కాంబినేషన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీకి నిమ్మరసం కలపడం వల్ల శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు...See More  

ఇక మోగేది 'సెల్లు' కాదు..'బిల్లే'..! (రాష్ట్రానికి రోమింగ్ షాక్)



ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడకు ఫోన్ చేసినా కాల్ చార్జి మాత్రమే పడేది. కానీ ఇక నుండి రాష్ట్రంలో రోమింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు. కనుక ఇక మీదట మీ మాటలను కొంచెం పొదుపుగా వాడండి. లేకపోతే ఇక నుండి మోగేది సెల్లు కాదు.. మీ మొబైల్ బిల్లు.
మొబైల్ కంపెనీలకు పండగే...   సాధారణంగా ఒకే రాష్ట్ర పరిధిలో ఉన్నంత వరకూ ఫోన్ కాల్స్ కు కాల్ ఛార్జి మాత్రమే పడుతుంది. కానీ, పరిధి దాటి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కాల్ ఛార్జితో పాటు.. అదనంగా రూపాయి నుండి మూడు రూపాయల వరకూ ఛార్జి వసూలు చేస్తారు. ఈ అదనపు భారాన్నే రోమింగ్ అంటారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. దీంతో రెండు రాష్ట్రాల ప్రజల నుండి రోమింగ్ పేరుతో అధిక ఛార్జీలు వసూలు...See More  

ఊగిసలాటలో 'కిరణ్ పార్టీ'..!



రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'కొత్త పార్టీ' పెట్టనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. కొత్త పార్టీ పేరు 'జై సమైక్యాంధ్రప్రదేశ్ ' అని ఒకరు.. పార్టీ గుర్తు 'చెప్పు' అని మరొకరు.. అంటున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు మార్చి 2న ముహూర్తం ఖరారు చేశారని ఒక వైపు ప్రచారం జరుగుతుంటే.. నిన్నటి దాకా కిరణ్ కు మద్దతు పలికిన నేతలు ఇప్పుడు జారుకుంటున్నారని మీడియా కోడై కూస్తోంది. ఏది ఏమైనా.. కిరణ్ కొత్త పార్టీ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇంతకీ కిరణ్ పార్టీ పెడుతున్నారా..? లేదా..??
కొత్తపార్టీకి మద్దతు కరువు..   సమైక్యాంధ్ర విషయంలో కిరణ్ కు మద్దతుగా ఉన్న నేతలందరూ.. కొత్త పార్టీ విషయంలో మాత్రం వెనకంజవేస్తున్నారు. విభజనకు పార్లమెంటు సైతం ఆమోదం తెలిపిన తర్వాత ఇక.. ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. విభజనకు అనుకూలంగా సిడబ్ల్యుసి నిర్ణయం...See More 

మెయిల్ కొట్టు.. 'మీల్' పట్టు.. (రైల్ ప్రయాణీకులకు ఆన్ లైన్ సౌకర్యం)



మంచూరియా, నూడుల్స్, పిజ్జా, బర్గర్ ఈ పేర్లు వింటేనే.. నేటి తరం వాళ్లకు నోరూరుతూ ఉంటుంది. ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తే అక్కడ వాలిపోతుంటారు. బయటకు వెళ్లలేనివారు ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి మరీ ఇంటికే తెప్పించుకుంటారు. మరి రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు పిజ్జా తినాలనిపిస్తే..? హైదరాబాద్ మీదుగా వెళ్తున్నప్పుడు 'బిర్యానీ' రుచిచూడాలనిపిస్తే..?
ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే చాలు..   మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మనం కూర్చున్న చోటికే.. నచ్చిన ఆహారం వస్తే.. ఎంత బాగుంటుందో కదా..? ఇదే ఆలోచనతో పలువురు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ను మనకు అందిస్తున్నారు. అది బావర్చి బిర్యానీ అయినా సరే.. డామినోస్ పిజ్జా అయినా సరే. కేవలం ఫాస్ట్ ఫుడ్ మాత్రమే కాదు.. ఇడ్లీ, దోస, వడ లాంటి ఐటెమ్స్ కూడా మీరు ఆర్డర్ ఇవ్వొచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఈ...See More 

పొలిటికల్ క్యాంటీన్.. (ఇడ్లీ, పాలు, చాయ్ తో నేతలు రెడీ..!)



రండిబాబూ రండి.. రూపాయికే ఇడ్లీ.. మూడు రూపాయలకే పెరుగన్నం. ఫ్రీగా పాలు, చాయ్ అంటూ.. రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు గాలం వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రకరకాల హామీలను ఇవ్వడంతోపాటు.. వారికి క్యాంటీన్ సౌకర్యం కూడా కలిపిస్తున్నారు. అయితే ఇది కేవలం ఎన్నికల వరకే లేండి.
క్యాంటిన్ బిజినెస్ లో ముందున్న జయలలిత..
       
క్యాంటీన్ నడపడంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అందరికంటే ముందున్నారు. గత ఏడాది నుండే.. ఆమె క్యాంటీన్ నిర్వహణలో బిజీ అయ్యారు. రూపాయకే ఇడ్లీ అందిస్తూ..తమిళ తంబీలను ఆకట్టుకున్నారు. తక్కువ బడ్జెట్ లోనే టిఫిన్ దొరకడంతో.. జయ ఇడ్లీలకు మార్కెట్ లో బాగానే డిమాండ్ పెరిగింది. దీంతో మూడు రూపాయలకే పెరుగన్నం అంటూ తన క్యాంటీన్ బిజినెస్ ను ఆమె విస్తరించారు. అంతేకాదండోయ్.. మధ్యాహ్నం వేళలో ఐదురూపాయలకే సాంబార్ అన్నం కూడా ఇక్కడ లభిస్తుంది. ఎంతైనా చెన్నై వాళ్లకు సాంబార్ అంటే ప్రాణం కదా..! దాన్నే జయ తన బిజినెస్ కోసం .. అదేనండీ పొలిటికల్ బిజినెస్ కోసం వాడేసుకున్నారు. తొలిదశలోనే జయమ్మ 200 క్యాంటీన్లు ప్రారంభించిందంటే.. ఈ బిజినెస్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు.

'చాయ్ వాలా' గా మోడీ..        ఇక గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 'చాయ్ వాలా' గా మారి ఓట్లకోసం 'చాయ్' అమ్ముకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో 'మోడీ చాయ్' పేరుతో.. తన 'టీ' రుచిని అందరికీ పరిచయం చేస్తున్నారు. అంతేకాదు...See More 

ఉద్యోగాన్వేషనలో నయా ట్రెండ్..(జాబ్ సెర్చ్ వయా సోషల్ మీడియా)



మీరు ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారా..? దీని వల్ల టైం వేస్ట్ అవుతుందేమో అనే అనుమానం కలుగుతుందా..? ఇక అలాంటి అనుమానాలకు చెక్ పెట్టేయండి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పలు కంపెనీల్లో సుమారు 20 నుండి 25 శాతం రిక్రూట్ మెంట్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు కన్సల్టెన్సీలు, ప్రకటనల ద్వారా ఉద్యోగ నియామకాలు చేసే కంపెనీలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆ పని చేస్తున్నాయట. ఇందుకోసం కొన్ని కంపెనీలు హెచ్ ఆర్ విభాగంలా.. ప్రత్యేకంగా 'సోషల్ మీడియా' విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయట.
        సాధారణంగా కంపెనీ వెబ్ సైట్స్ కు వెళ్లి అక్కడ మన ప్రొఫైల్ కు తగిన జాబ్ ఉందా లేదా అని చూస్తుంటాం. కానీ.. సోషల్...See More  

జాతీయ నేతలను ప్రశ్నించాలా..? అయితే చలో 'ఫేస్ బుక్'..!



రాజకీయ పార్టీ నేతలు ప్రజలకు రోజుకో హామీ ఇస్తుంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వరాల వర్షం కురిపిస్తారు. అవన్నీ వినే ప్రజలకు ఈ హామీలన్నీ నెరవేరుతాయా..? అనే సందేహం కలగక మానదు. కొంచె ఆర్థిక రంగంపై అవగాహన ఉన్నవారైతే.. మోసపూరిత హామీలు ఎందుకు ఇస్తున్నార్రా బాబూ అంటూ లోలోపల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే.. ఇక మీదట మీ ఆగ్రహాన్ని మీలోనే దాచుకోవాల్సిన పనిలేదు. తప్పుడు హామీలిస్తున్న నేతలను సూటిగా ప్రశ్నించే అవకాశం వచ్చింది. ఇందుకు 'ఫేస్ బుక్' ఒక వేదిక ఏర్పాటు చేస్తోంది.
ఫేస్ బుక్ టాక్స్ లైవ్...        రానున్న ఎన్నికల నేపథ్యంలో సామాన్యులు జాతీయ నేతలను ప్రశ్నించేందుకు 'ఫేస్ బుక్' సంస్థ తన వెబ్ సైట్ లో 'ఫేస్ బుక్ టాక్స్...See More  

వికలాంగుల కోసం ఓ 'యాప్'..!



ప్రస్తుతం మొబైల్ రంగంలో స్మార్ట్ ఫోన్ లు హల్ చల్ చేస్తున్నాయి. రోజుకో కొత్త యాప్ తెరపైకి వచ్చి నెటిజన్లను ఆకర్షిస్తోంది. మహిళల రక్షణ కోసం, ప్రేమికుల కోసం, విద్యార్థుల కోసం ఇలా రకరకాల యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా వికలాంగులకోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. దీన్ని యాప్ లాగా డౌన్ లోడ్ చేసుకుని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారు ఇంటర్నెట్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ యూజర్స్ కోసం తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఇంతకీ ఈ యాప్ ఉపయోగం ఏమిటంటే..?       ప్రస్తుతం ఉన్న రెస్టారెంట్లు, మాల్స్, సినిమా హాళ్లు తదితర ప్రదేశాలు వికలాంగులకు ఎంతమాత్రం సౌకర్యవంతంగా లేవనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వికలాంగులకు అత్యంత అవసరమైన వీల్....See More  

'ఫేస్ బుక్' సొంతమైన 'వాట్స్ యాప్'..!



 స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతిఒక్కరికీ బాగా పరిచయమున్న అప్లికేషన్. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఈ అప్లికేషన్ .. ప్రారంభమై ఐదు సంవత్సరాలు కూడా కాకముందే ఫేస్ బుక్ కు ధీటుగా నెటిజన్లను ఆకర్షించింది. మెసేజ్ లు, ఇమేజ్ లు, ఆడియోలు, వీడియోలు ఫ్రీగా షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో గ్రూప్ చాట్ సౌకర్యం కూడా ఉంది. అయితే, మొబైల్ నెంబర్ ఆధారంగా పనిచేసే ఈ అప్లికేషన్ ను .. ఉపయోగించుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. 2009లో కాలిఫోర్నియా కేంద్రంగా ప్రారంభమైన ఈ అప్లికేషన్ నేడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 కోట్ల మందికి...See More  

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ..? (ఆర్నెల్లపాటు కోల్డ్ స్టోరేజ్ లోనే..!)



ప్రజల నిరసనలు, ఆందోళనలు.. నేతల ఎత్తుగడలు, వ్యూహాలు.. వీటన్నింటి మధ్య రాష్ట్ర విభజన దాదాపు జరిగిపోయినట్లే.. కొన్ని కీలక అంశాలు మినహా విభజన ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాజధాని అంశం. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. తర్వాత అది తెలంగాణకే చెందుతుంది. మరి సీమాంధ్ర రాజధాని..? ఈ అంశంపైనే ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొని ఉంది. సీమాంధ్రకు కొత్త రాజధానిగా నిలిచేది ఏ నగరం.. బెజవాడ..? విశాఖపట్నమా..?? తిరుపతా..??? లేక మరేదైనానా!? అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
బెజవాడకు అవకాశాలెక్కువ..
  వీటన్నింటిలోనూ.. విజయవాడ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే కొత్త రాజధాని ఏర్పాటు చేసేంత స్థలం ఆ నగరంలో లేకపోవడం కొంత మైనస్ పాయింట్ గా ఉంది. ఈ క్రమంలో.. హైద్రాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల స్థాయిలో విజయవాడ - గుంటూరులను...See More  

భూమ్మీద ఉన్నవారందరికీ ఇంటర్ నెట్ ఫ్రీ..! (వరల్డ్ వైఫై తో కనెక్ట్ అయితే చాలు..)



నేడు ప్రతిఒక్కరూ ల్యాప్ టాప్, నోట్ బుక్, ట్యాబ్ లెట్ లేదా స్మార్ట్ ఫోన్.. ఇలా ఏదో ఒక గ్యాడ్జెట్ ద్వారా నెట్ తో కనెక్ట్ అయిపోతున్నారు. ఎక్కడ ఉన్నా సరే.. సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే సంస్థలు ఎక్కువైపోయాయి. 1 mbps – రూ.450 అని ఒకరంటే.. రూ.350 కే 1 mbps నెట్ అందిస్తామని మరొకరు పోటీపడుతున్నారు. మూడు నెలల నెట్ కనెన్షన్ తీసుకుంటే నో ఇన్ స్టాలేషన్ ఫీ అంటూ ఒకరు.. ఆరు నెలలకు తీసుకుంటే 25జిబి డౌన్ లోడింగ్ ఫ్రీ అని మరొకరు నెటిజన్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్ని చెప్పినా.. వీరంతా నెటిజన్ల పర్సు ఖాళీ చేస్తున్నవారే. ఇక ఇలాంటి వారికి చెక్ పెట్టే సమయం వచ్చేసింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత ఇంటర్ నెట్ కనెక్షన్ అందుబాటులోకి రాబోతుంది.
ప్రపంచస్థాయి 'వైఫై' గా 'ఔటర్ నెట్'...
ఫ్రీ ఇంటర్ నెట్ కనెక్షనా..? అదీ భూమి మీద ఉన్న ప్రతిఒక్కరికీనా..??...See More 

రాష్ట్ర పాలకుడు ఎవరు..? రాష్ట్రపతా..? కొత్త ముఖ్యమంత్రా..?!



లోక్ సభలో రాష్ట్రపునర్వ్యవస్థీకరణ బిల్లు మూజువాణి పద్దతిలో ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో ఆమోదమే మిగిలింది. మరోవైపు, ఇప్పటికే.. సిఎం కిరణ్ రాజీనామా వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందగానే.. సిఎం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? లేక కొత్త ముఖ్యమంత్రి రానున్నారా..? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సిఎం పదవికి కిరణ్ రాజీనామా..?  రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో పాలన స్తంభించింది. శాంతి భద్రతలు కరువయ్యాయి. సిఎం సహా.. మంత్రులు, ప్రధాన పార్టీల నేతలు, ఉద్యోగులు ప్రాంతాల వారీగా...See More  

ముందుంది ముసళ్లపండగేనా..?



సోమవారం నాడు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రజలపై ఎలాంటి భారాలు మోపలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విత్త మంత్రి ఈ విధంగా జాగ్రత్తపడినా.. మనకు మేలే జరుగుతుందిగా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే .. బడ్జెట్ ప్రసంగాన్ని పరిశీలనగా చూస్తే.. ముందు ముందు మనపై అధిక భారం మోపేందుకే ఆర్థిక మంత్రి ఈ విధంగా బడ్జెట్ రూపొందించినట్లు అర్థమవుతోంది. అదే జరిగితే.. సామాన్యుడు భవిష్యత్తులో భరించలేని భారం మోయాల్సిందే..!దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆర్థిక....See More  

దెబ్బ ఒక్కటే.. పిట్టలు మాత్రం మూడు..! కమలం వికసించే దారి ఇదేనా..?!



ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడి మీరు వినే వింటారు. ప్రస్తుతం బిజెపి ఈ నానుడినే ఫాలో అవుతుంది. కానీ.. దీంట్లో అడ్వాన్స్ వెర్షన్ ఫాలో అవుతోంది. దెబ్బ ఒక్కటే అయినా, పిట్టలు మాత్రం మూడింటిని కొట్టేయాలని ప్లాన్ వేస్తోంది. ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇంతకీ ఏంటా పిట్టలు అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవండి..
తెలంగాణ, సీమాంధ్రలో పాగా వేయడం..   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని.. విభజన నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని బిజెపి పెద్దలు రోజూ మీడియా ముందు గొంతు చించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్.. తమను ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. బిజెపి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ముందునుండీ అనుకూలంగానే ఉందని...See More 

C.A. విద్యార్థుల కోసం ఓ టీవీ ఛానల్..!



మ్యూజిక్ ఛానెల్, న్యూస్ ఛానెల్, హెల్త్ ఛానెల్ ఇలా రోజుకో కొత్త ఛానెల్ బుల్లి తెరపై ప్రత్యక్షమవుతోంది. తాజాగా ఈ లిస్ట్ లో మరో కొత్త ఛానెల్ చేరబోతుంది. అయితే.. ఇది విద్యార్థులకు ఉపయోగపడే ఛానెల్. అది కూడా కేవలం చార్టెర్డ్ ఎకౌంటెంట్ చదివే విద్యార్థులకు మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్న సిఎ విద్యార్థులకు మరింత చేరువవ్వాలనే లక్ష్యంతో ద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్...See More  

Youtube.com వయసు తొమ్మిదేళ్లు..!



ఇంటర్నెట్ గురించి తెలిసిన వారికి 'యూట్యూబ్' గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. మనం ఏ వీడియో చూడాలన్నా.. ముందుగా ఓపెన్ చేసేది యూట్యూబ్ నే. ఇది ఎన్నో అసాధారణ, అద్భుత వీడియోలను క్షణాల్లో మన కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తుంది. సాంకేతికరంగంలో 'యూట్యూబ్' విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలి. గూగుల్, ఫేస్ బుక్ స్థాయిలో ప్రజాదరణ కలిగిన 'యూట్యూబ్'.. నేడు తన 9 వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం (2005లో) ఇదే రోజు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గా యూట్యూబ్ ప్రారంభమైంది. ఆ...See more 

ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఫ్రెష్ రోటీ రెడీ..!



మీరు ఏమాత్రం కష్టపడకుండా.. ఆటోమేటిగ్గా రోటీ రెడీ అయితే..? అది కూడా.. రోటీ ఎంత సాఫ్ట్ గా ఉండాలి? ఎంత మందంగా ఉండాలి అని కూడా మీరే డిసైడ్ చేసే అవకాశం ఉంటే..? భలేగా ఉంటుంది కదూ..! ఇదే ఆలోచన సింగపూర్ కి చెందిన ఓ కంపెనీకి వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఆచరణలో పెట్టి కేవలం ఒక్క బటన్ తో ఫ్రెష్ రోటీస్ తయారు చేసే ఓ మిషన్ ను కనిపెట్టారు. మిషన్ అంటే ఇదేదో భారీ సైజులో ఉంటుందనుకుంటే పొరపాటే. చాలా కంఫర్ట్ బుల్ సైజులో దీన్ని డిజైన్ చేశారు. దీనిలో.....See More 

'సెకండ్ హ్యాండ్' కే.. ఫస్ట్ ప్లేస్!



సాధారణంగా సెకండ్ హ్యాండ్ వస్తువులంటే చాలా మంది చిన్నచూపు చూస్తుంటారు. కానీ.. ఇటీవలి కాలంలో ఈ వస్తువులకు డిమాండ్ బాగా పెరుగుతోందట. ఎంతంటే.. కొని సెకన్ల వ్యవధిలోనే సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముడుపోతున్నాయట. బ్రాండెడ్ వస్తువులు బయటి మార్కెట్ కన్నా.. ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో సుమారు 30 శాతం తక్కువ ధరకు లభిస్తున్నాయి. అది కారైనా,....See more 

పసుపుతో క్యాన్సర్ కు చెక్ ..! అయితే.. వంటల్లో వాడితే ఉపయోగం లేదు..!!



 మనం నిత్యం వంటల్లో వాడే పసుపులో యాంటి బయాటిక్ ఉంటుందని.. ఇది రోగనిరోధక శక్తిలా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే.. ఈ పసుపులో క్యాన్సర్ కణాలు నిరోధించే 'కర్క్యుమిన్' అనే పదార్థం కూడా ఉందట. ఈ పదార్థం ప్రాణాంతకమైన క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుందట. ఈ విషయం కూడా మాకు తెలుసుకదా అని కొందరు అనుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిన అసలైన విషయం మరొకటి...See More 

సెంచరీ కొట్టిన 'మామ్'..




 మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ను ఇస్రో ప్రయోగించి 100 రోజులైంది. ప్రస్తుతం ఇది భూ కక్ష్య దాటి.. అంగారకుని వైపు ప్రయాణిస్తుంది. మరో 210 రోజులు ఇదే దిశలో ప్రయాణిస్తే.. అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశిస్తుంది. అంగారక గ్రహంపై జీవాన్వేషణ, వాతావరణం, ఖనిజాల పరిశోధన కోసం ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. మామ్‌ శాటిలైట్‌ అక్కడ ప్రయోగాలు జరుపుతూ ఫలితాలను భూమిపైకి పంపుతుంది. ఈప్రయోగంతో.. అంతరిక్ష యవనికపై ఇస్రో ఓ సువర్ణ అధ్యాయాన్ని నెలకొల్పింది. అంతరిక్ష రంగంలో పేరొందిన అమెరికా, రష్యా, చైనా, ఐరోపా దేశాల సరసన మనదేశాన్ని నిలిపింది. ఇస్రో గత ఏడాది నవంబర్ 6న ఈ ప్రయోగానికి శ్రీకారం...See more 

ఈ నోటు.. నీటిలో నానదు..చింపినా చిరగదు..నకిలీది దొరకదు..!



ఇక నుండి చిరిగిన నోట్లు మార్చుకునేందుకు బస్ కండక్టర్ తోనో.. లేక పచారీ కొట్టు వారితోనో గొడవపడాల్సిన అవసరం లేదు. అలాగే.. జేబులో మర్చిపోయిన నోట్లను అలాగే ఉతికేసినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే.. మీరు చింపినా చిరగని నోట్లు.. నీటిలో తడిసినా చెక్కు చెదరని కరెన్సీ మనకు అందుబాటులోకి రానుంది. అదే 'ప్లాస్టిక్ కరెన్సీ'. దీనికి నకిలీ సృష్టించడం కూడా కష్టమేనట..!
లోహం నుండి ప్లాస్టిక్ దాకా...      నకిలీ కరెన్సీని కట్టడిచేసే క్రమంలో .. ఈ ప్లాస్టిక్ కరెన్సీని ఆర్బీఐ అందుబాటులోకి తేనుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా రాజ్యసభలో తెలిపారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లు విలువచేసే...See More 

విభజనపై మాది ఒకటే మాట : ప్రకాశ్ కరత్

'ఫేస్ బుక్' వయసు పదకొండేళ్లు..!



ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఊసుపోని కబుర్లు చెప్పుకునే స్థాయి నుంచి ఉద్యమాలకు వేదికగా నిలిచే స్థాయికి చేరింది. దాదాపుగా ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్ అకౌంట్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక వ్యక్తి తన ఆనందం, ఆవేశం, ఆవేదన, ఆక్రందన, సూచన.. మొదలైన వాటిని అభిప్రాయం రూపంలో పంచుకునే సాధనం కావడంతో ఫేస్ బుక్ తక్కువ కాలంలోనే అనితర సాధ్యమైన ప్రగతిని సాధించింది. ఇంతింతై.. అన్న చందంగా ఎదుగుతూ వచ్చిన 'ఎఫ్ బీ' కి నేటితో పదేళ్లు పూర్తై పదకొండో ఏట అడుగు పెడుతోంది. నెటిజన్లలో తనదైన మేనియా క్రియేట్ చేసిన ఫేస్ బుక్ పుట్టిన రోజు సందర్భంగా దాని పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం..
1..2..3..        ప్రపంచంలో ప్రతీ ఆరుగురిలో ఒకరు ఫేస్ బుక్ వినియోగిస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల మంది ఫేస్ బుక్...See More  

'అద్దేపల్లి'తో ముఖాముఖి..

భద్రాద్రి రాముడు.. మునుగుతాడా..? తేలుతాడా..??



భద్రాద్రి రామయ్యకు మహాగండం వచ్చిపడింది..! ఎటూ తప్పించుకునే వీళ్లేని 'జలగండం' పొంచి ఉంది. కోరిన కోర్కెలు తీర్చి, భక్తజనుల కష్టాలు కడతేర్చే దేవుడిగా పేరొందిన స్వామికి ఇప్పుడు.. తీరని కష్టం వచ్చి పడింది. భద్రగిరిని ముంచేందుకు 'పోలవరం' రూపంలో గంగమ్మ వేచి చూస్తోంది. మరి.. ఈ పరిస్థితుల్లో రాముడు మునిగిపోతాడా..? తనను తాను రక్షించుకుంటాడా..??
భవిష్యత్ లో రామయ్య దర్శనం కలిగేనా..?        ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొన్ని సవరణలతో ఆ తంతు ముగించింది. ఇందులో ప్రధానమైంది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం. మొన్నటి వరకూ భద్రాచలం డివిజన్ తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించిన కేంద్రం.. సీమాంధ్రుల ఆందోళనతో కాస్త మెత్తబడింది. పోలవరం ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు సమ్మతించింది. ఇందులో భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లకు చెందిన 9 మండలాలు ఉన్నాయి. భద్రాద్రి పట్టణాన్ని మాత్రం తెలంగాణకు వదిలిపెట్టింది. అయితే.. రామయ్యను తెలంగాణ వారికే...See more 

జలయజ్ఞం నిధులు ప్రాజెక్టుల నిర్మాణానికా..? కాంట్రాక్టర్ల జేబుల్లోకా..?? (ప్రతీ బడ్జెట్ లో నిధుల వరదే..!)



ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో జలయజ్ఞానికి కేటాయిస్తున్న నిధులు ఎక్కడికెళుతున్నాయి..? నిజంగా ఆ నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారా..? ఒక వేళ ప్రాజెక్టులకే ఖర్చు చేస్తే ఒక్కటి కూడా పూర్తి కాలేదెందుకు..?! లేదంటే.. ఈ పేరుతో కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకుంటున్నారా..? అనే ప్రశ్నలకు సమాధానం లభించట్లేదు. తాజాగా.. 2014 -15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోనూ మరోమారు జలయజ్ఞానికి రూ. 20 వేల కోట్లు కేటాయించడం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా గుత్తేదారుల జేబుల్లోకే పంపేందుకే ప్రభుత్వం ఈ మొత్తాన్ని కేటాయించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
లక్షల కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలు...   రాష్ర్టంలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే 26 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. అంతే కాదు అందుకు....See more 

బ్యాంకులకు లాభాలొస్తే ఉద్యోగుల జీతాలు పెంచాలా..? ఆ డబ్బు వేరే పనులకు వాడుతాం (చిదంబర వాక్కులు)



'' బ్యాంకులు లాభాల్లో ఉన్నాయా..? ఉంటే.. ఉద్యోగులకు జీతాలు పెంచాలా..? వచ్చిన లాభాలతో వేతనాలు పెంచలేం.. ఆ డబ్బు ఇతర పనులకు వాడాల్సి ఉంది. అయినా.. ఈ సంగతి బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లకు వేరే చెప్పాలా..?'' ఈ సూక్తి ముక్తావళి వినిపించిందే ఎవరో కాదు.. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి చిదంబరం. తమకు వేతనాలు పెంచాలని, బ్యాకింగ్ రంగంలో సంస్కరణలు నిలిపేయాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులకు చిదంబరం చేసిన జ్ఞాన బోధ ఇది. ఆర్థిక మంత్రువర్యుల వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు యోచిస్తున్నాయి...
న్యాయమైన కోర్కెలు తీర్చాలని...   వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో పాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు సోమవారం ...See more

వండర్ న్యూస్: వరుడి మెడలో వధువు తాళి కట్టిందట..!



వధువు మెడలో వరుడు మాత్రమే ఎందుకు తాళి కట్టాలి..? అబ్బాయి మెడలో అమ్మాయి మూడు ముళ్లు ఎందుకు వేయకూడదు..?? అని ఆలోచించిందో చలాకీ అమ్మాయి. ఆలోచన రాగానే పెళ్లి పెద్దల ముందే పెళ్లికొడుకు మెడలో తాళి కట్టేసింది. ఈ ఆశ్చర్యకర సంఘటనకు తమిళనాడులోని ఓ గ్రామం వేదికైంది. తిరువాయూరుకు చెందిన వాసంతి, శ్రీరంగానికి చెందిన సతీష్ కుమార్ కు పెద్దలు వివాహం నిశ్చయించారు. వివాహ తంతులో...See More  

'సివిల్స్ 'పై దండెత్తడానికి మరో రెండు ఛాన్స్ లు...



సివిల్స్ పరీక్షలు రాయడానికి మీకు ఉన్న అవకాశాలన్నీ చేజారిపోయాయా..? సివిల్స్ సాధించాలన్న మీ ఆశయం నెరవేరకుండా పోయిందనే బాధలో ఉన్నారా..?? అయితే.. ఈ సమాచారం ఖచ్చితంగా మీకు ఊరటనిచ్చేదే! ఈ ఎగ్జామ్ రాసే వారికి మరో రెండు సార్లు అవకాశం ఇవ్వాలని ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
   ఇప్పటి వరకూ....See more 

స్నోడెన్ అంత ఈజీగా అమెరికా రహస్యాలను రాబట్టాడా..? (వావ్.. ఆశ్చర్యం!!)



ఎడ్వర్డ్ స్నోడెన్.. ఈ భూమ్మీద తనకు ఎదురే లేదని విర్రవీగుతూ అమెరికా సాగిస్తున్న గూఢచర్యపు గూడుపుఠాణిని ప్రపంచానికి వెల్లడించిన హీరో. ప్రపంచ పౌరుల వివరాలను రహస్యంగా సేకరిస్తున్న వైనాన్ని కళ్లకు కట్టాడీ మూడు పదుల వయసున్న యువకుడు. ఇదిలా ఉంచితే.. చీమ చిటుక్కు మంటేనే అప్రమత్తమయ్యే తమ అమెరికా నుంచి.. ఇంత పెద్ద రహస్యాన్ని స్నోడెన్ ఎలా సేకరించాడబ్బా..? అని చాలా మంది అనుకున్నారు. కానీ.. ఒక చిన్న సాఫ్ట్ వేర్ తో అమెరికా కుంభస్థలాన్ని కొట్టాడు స్నోడెన్. దానిపేరు 'వెబ్ క్రాలర్'. కంప్యూటర్ పై ప్రాథమిక అవగాహన....See more  

షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో ధోని, రైనా హ్యాండ్..?



భారత క్రికెట్ లో ఫిక్సింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఐపీఎల్ ఆరవ సీజన్ లో ఫిక్సింగ్ కు పాల్పడి, జీవితకాల నిషేధానికి గురైన శ్రీశాంత్, తదితరులను మరవకముందే.. అదే ఫిక్సింగ్ లో మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ పూర్తిచేసిన ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో టీమిండియా కెప్టెన్ ధోని, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రైనా పేర్లు ఉన్నాయన్న వార్తలు అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఐపీఎల్లో ధోనీ, రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధోనీ చెన్నై జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడు. చెన్నై ఫ్రాంచైజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు చెందినది కావడం, ఆయన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ను ముద్గల్ కమిటీ దాదాపు దోషిగా తేల్చిన నేపథ్యంలో....See More  

చెత్త బండి మొరాయించింది..!! ఎందుకంటే..?!



రాష్ర్టంలో చెత్త బండి మొరాయించింది..! ఇక కదలలేనంటోంది..! ఎందుకంటే..? చెత్తబండిని నడిపించే కార్మికుడు సమ్మెబాటపట్టాడు... కనీస వేతనాలు ఇవ్వాలని రోడ్డెక్కాడు. అందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నాడు.. అయినా ప్రభుత్వం దిగిరావడం లేదు... కార్మికులకు న్యాయం చేయడాన్ని అటుంచి.. చెత్త ఎత్తే పనులను రాంకీ అనే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తామని జిహెచ్ఎంసి కమిషనర్, మేయర్ మాజిద్ హుస్సేన్ కార్మికులను బెదిరిస్తున్నారు. దీంతో కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతం రూపం దాలుస్తోంది... ఫలితంగా చెత్త ఎత్తే దిక్కులేక హైదరాబాద్ నగరం, రాష్ర్టంలోని పలు పట్టణాలు మురికి కూపాలుగా మారిపోయాయి. గల్లీ గల్లీ గలీజుగా మారి కంపుగొడుతున్నాయి.
చాలీచాలని జీతాలతో సతమతం..       మున్సిపల్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం చాలీచాలని జీతాలు చెల్లిస్తోంది. ఇప్పుడు చెల్లిస్తున్న వేతనాలు పెరిగిన ధరల కారణంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఏ మూలకూ సరిపోవడం లేదని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ వేతనాలతో అప్పుల పాలవుతున్నామని, కనీస వేతనం రూ.12,500 చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని....See More 

సమ్మెల్లో కార్మికులు..! విభజన లొల్లిలో పాలకులు..!! (ఎన్నాళ్లీ పంచాయితీ..?!)



ఒకరిది ఆకలి పోరైతే.. మరొకరిది అధికార ఆరాటం..! తాము జీవించేందుకు కనీస వేతనాలు చెల్లించాలని కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తుంటే.. వారి సమస్యలను పట్టించుకోకుండా అధికారమే అంతిమ లక్ష్యం అన్నట్లు పాలకులు, రాజకీయ నాయకులు రాష్ర్ట విభజన లొల్లిలో మునిగితేలుతున్నారు. కడుపు మాడుతోంది.. కనికరించండి మహా ప్రభో అంటున్న కార్మికుల ఆవేదన పాలకుల చెవికెక్కడం లేదు.. చాలీచాలని జీతాలతో కుటంబపోషణ భారమవుతోందని, అందుకు వేతనాలు పెంచాలని కార్మికులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సమ్మె చేసి దిగ్విజయంగా తమ నిరసన తెలియజేశారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆరు రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి పోలీసులతో దెబ్బలు తింటున్నారు. అయినా ప్రభుత్వం దిగిరావడం లేదు. వారి సమస్యలను పరిష్కరించకపోగా జిహెచ్ఎంసిలో చెత్త ఎత్తే కార్యక్రమాన్ని రాంకీకి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత....See more  

డేంజర్ న్యూస్: ఈరోజు.. పార్లమెంటులోకి కత్తులు.. పెప్పర్ స్ర్పే.. మరి రేపు..?!



భారత పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు..! నిండు సభలో ప్రజాప్రతినిధులు తమను తాము మరచిపోయి.. కత్తులు, హానికర వాయువులతో హల్ చల్ చేశారు..!! స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సభా మర్యాదను ఖూనీ చేశారు..!!! ఇది దేనికి సంతకేతం..? ఈ రోజు కత్తి, పెప్పర్ స్ర్పే ప్రత్యక్షమైన సభలో రేపు ఏం కనిపించబోతున్నాయి..?? అంతిమంగా.. సభ్యుల ప్రవర్తన భావి తరాలకు ఏం నేర్పిస్తోంది..???
పెప్పర్ స్ర్పే చేసిన లగడపాటి...   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెడుతున్న సందర్భంలో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఒక అడుగు ముందుకేసి స్పీకర్ పై......See more 

మిస్టర్.. కిరణ్, లగడపాటి, సబ్బం.. మీరు ఇంకా కాంగ్రెస్ లో ఎందుకున్నట్టు..?!



'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు, చివరకు దేశానికి హానిచేసే విధంగా అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తోంది. మా పార్టీ (కాంగ్రెస్) నిర్ణయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా..'' - కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి
'' కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో గూండాగిరి చేస్తోంది. పార్లమెంటు 10 జన్ పథ్ అనుకుంటున్నారా..? రాష్ట్ర విభజన కమల్ నాథ్ సొంత వ్యవహారం కాదు. కాంగ్రెస్ మజిల్ పవర్ తో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.'' - సబ్బం హరి, కాంగ్రెస్ ఎంపీ, అనకాపల్లి నియోజకవర్గం (విశాఖ పట్నం).
    '' కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనలో కొనసాగే హక్కులేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. విభజన విషయంలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరిస్తోంది..'' - లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ ఎంపీ, విజయవాడ.
పై ముగ్గురి స్టేట్ మెంట్స్ గమనిస్తే...See more  

ఇవిగో.. కేజ్రీవాల్ రాజీనామాకు అసలు సిసలైన కారణాలు..!!



దేశ రాజకీయ ముఖచిత్రంలో తనదైన ముద్రవేసి, యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న 'ఆమ్ ఆద్మీ పార్టీ' హాఫ్ సెంచరీ కూడా కొట్టకుండానే ఎందుకు ఔట్ అయిపోయింది..?
  సామాన్య వ్యక్తిగా అవినీతిపై పోరాటం సాగించి అసామాన్య రీతిలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన అరవింద్ కేజ్రీవాల్ అర్ధాంతరంగా ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారు..??
  ఒకే ఒక్క బిల్లు కోసం కేజ్రీవాల్ 'క్రేజీ'గా రిజైన్ చేయడమేంటి..??? రాజీనామా చేయడానికి కారణం ఇదేనా..? మరేదైనా ఉందా..?!
  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరినీ తొలుస్తున్న ప్రశ్నలు ఇవే..! అయితే.. వీటికి సరైన సమాధానం మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు..!! ఆ కారణాలు.. వాటి పరిణామ క్రమం గురించి చర్చిద్దాం...
సామాన్యుని కష్టాలు తీర్చాలనుకోవడం మొదటి కారణం...       సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను సాధనంగా చేసుకున్న కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ఉవ్వెత్తున దూసుకొచ్చారు. ఢిల్లీ....See more 

టి.బిల్లు గెలుస్తుందా..? ఓడుతుందా..??




నేడే పార్లమెంటులో టి.బిల్లుపై చర్చ..!
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు..!!
సభ సజావుగా సాగుతుందా..? రచ్చ రచ్చ అవుతుందా..?!
ఫైనల్ గా.. తెలంగాణ బిల్లు ఓడుతుందా..? గెలుస్తుందా..??



ఆమోదానికే కాంగ్రెస్ కసరత్తు...
             
రాబోయే ఎన్నికల్లో లబ్ది కోసమే రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న కాంగ్రెస్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశాల్లోనే టి.బిల్లును ఆమోదించాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే బిజెపి నేతలతో ఏకంగా ప్రధాన మంత్రి విందు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇతర బిల్లులు అన్నింటినీ పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రధానంగా టి.బిల్లుపైనే దృష్టి కేంద్రీకరించింది. ఏది ఏమైనా ఈ రోజు బిల్లును ఆమోదించాలనే కృత నిశ్చయంతో ఆ పార్టీ ఉంది.

గోడమీద పిల్లి వాటాన్ని అవలంభిస్తున్న బిజెపి...         మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని ముక్త కంఠంతో చెబుతూ వచ్చిన బిజెపి నేతలు ఇప్పుడు గొంతు సవరిస్తున్నారు. విభజనపై తలో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ బిల్లుకు తాము మద్దతిచ్చేది లేదని పార్టీ సీనియర్ నేత అద్వానీ అంటుంటే.. విభజనకు తాము కట్టుబడ్డామని అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ చెబుతున్నారు. సుష్మా స్వరాజ్ పూటకో మాట మాట్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణ నేతలు మాత్రం బిజెపి తప్పకుండా విభజనకు మద్దతు ఇస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా...See more 

రాష్ట్రాలు రెండైనా.. ప్రజలు పోరాడాల్సిందే : రాఘవులు


jcrop-preview

రాష్ట్రాలు రెండైనా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగించాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంపై రాఘవులు 'టెన్ టివి'తో మాట్లాడారు. ఆ వివరాలు...
టెన్ టివి: సభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు, ఆమోదించిన తీరును మీరు ఎలా విశ్లేషిస్తారు..?
రాఘవులు : గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ప్రకటన చేయడం, వెనక్కి పోవడం, మళ్ళీ ప్రకటన చేయడం, వెనక్కి పోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీలోనే అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకోవడం, రాష్ట్ర స్థాయిలో వ్యతిరేకించడం జరిగాయి. పార్లమెంటులో రభస చేసే వారిలో కాంగ్రెస్ వారే ముందున్నారు. కాంగ్రెస్ పార్టీయే తమ పార్టీ వారిని సస్పెండ్ చేయడం, కాంగ్రెస్ మంత్రులే స్పీకర్ వెల్ లోకి దూసుకుపోయారు. మొత్తంగా కాంగ్రెస్ జుగుప్సాకరమైన పరిస్థితి సృష్టించింది. ఈ చేష్టలు ఎవ్వరూ అంగీకరించేవి కావు. దురదృష్టమేమిటంటే ఇవన్నీ సాంకేతిక విషయాలైపోయాయి. రాష్ట్ర విభనకు కాంగ్రెస్, బిజెపి అంగీకరించిన తర్వాత.. దీనిపై చేసే నిరసనలకు విలువ లేకుండా పోయింది.See more 

సీఎం పదవికి కిరణ్ రాజీనామా..!


jcrop-preview

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగానే రాజీనామా చేసినట్లు కిరణ్ ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిన మూడు సంవత్సరాల రెండు నెలల 19రోజుల పదవీ కాలానికి తెరపడింది. 2010 నవంబర్ 25న సీఎంగా ప్రమాణం చేసిన కిరణ్.. 2014 ఫిబ్రవరి 19న విరమణ ప్రకటించారు. దీంతో.. ఇప్పటి వరకూ అవిభక్త ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రుల్లో 16వ, చివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి నిలిచిపోనున్నారు...
ఓట్లు, సీట్ల కోసం.. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు..       కేవలం రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విభజన తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 50ఏళ్లపాటు ఎంతో మంది చేసిన పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, అలాంటి రాష్ట్రాన్ని 58 ఏళ్ల తర్వాత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ విభజించిందని ధ్వజమెత్తారు.

టీమిండియా పరాభవానికి ముఖ్యంగా నిందించాల్సింది వారినే ..!



విదేశీ గడ్డపై మరో పరాభవం... సఫారీ గడ్డపై ఘోర పరాజయం మరువక ముందే.. కివీస్ గడ్డపైనా కనీసం ఒక్క విజయమైనా లేకుండా టీం ఇండియా వెనక్కు తిరిగింది. 2011 ప్రపపంచకప్ గెలిచిన జట్టు ఇదేనా..? అన్న అనుమానాలు తలెత్తేలా భారత ఆట తీరు రోజురోజుకూ దిగ జారుతోంది. టీం ఇండియా వరుస ఓటములకు ఆటగాళ్లది బాధ్యత అన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నా...అసలు బాధ్యత వహించాల్సింది మాత్రం భారత క్రికెట్ బోర్డు...యువ భారత్ లో జోరేదీ...       సచిన్, ద్రావిడ్, గంగూలీ, సెహ్వాగ్,కుంబ్లే, హర్భజన్,జహీర్ ...కొన్నేళ్ల పాటు ప్రత్యర్థులకు వెన్నులో చలిపుట్టేట్టు రాణించారు. వీరి కనుసన్నల్లో ధోనీ, గంభీర్, రైనా, కోహ్లీ, రోహిత్, ఇషాంత్, అశ్విన్ ఎదిగారు. దిగ్గజాల్లో సచిన్, ద్రావిడ్, గంగూలీ రిటైర్ కాగా... మిగతా వారు ఫాం లేమితో జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో యువతరం తో కూడిన జట్టు తెరమీతకు వచ్చింది. గత ఏడాది సచిన్ సైతం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో అటు టెస్టు, ఇటు వన్డే క్రికెట్ లోనూ యువకులతో కూడిన జట్టు తయారైంది. అయితే ఈ యువ భారత్ జట్టు వన్డేల్లో ఒక మోస్తారుగా రాణించింది. టెస్టుల్లో మాత్రం ఆపసోపాలు పడుతోంది. ఇక విదేశీ గడ్డపై టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ చతికిలపడుతోంది. దిగ్గజాల కనుసన్నల్లో ఎదిగిన కోహ్లీ, ధోనీ మాత్రమే భారత జట్టుకు అండగా నిలుస్తున్నారు. గంభీర్ జట్టులో చోటు కోల్పోగా, రైనా, రోహిత్, ఇషాంత్, అశ్విన్ జట్టులో చోటు నిలుపుకోవడానికి అనేక కష్టాలు పడుతున్నారు. కొత్త ఆటగాళ్లు ఛటేశ్వర పుజారా, అజింక్య రహానే, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ అడపదడపా రాణిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో టీం ఇండియాకు భరోసా కల్పించడంలో విఫలమవుతున్నారు.తప్పెవరిది...?స్వదేశంలో ఫర్వాలేదనిపిస్తున్నా...విదేశాల్లో మాత్రం యువ భారత్ బోల్తా పడుతోంది. దీనికి బాధ్యత ఎవరిది....? అందరి దృష్టి ఆటగాళ్ల పైనే పడుతోంది. జట్టులో ఉన్న ఆటగాళ్లు సరిగా ఆడకపోవడమే వైఫల్యానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లను కానీ, బోర్డును కానీ ఎవరూ ఏమీ అనే సాహసం చేయడం లేదు. అసలు భారత క్రికెట్ బోర్డు చేస్తున్న తప్పిదాలు మాజీ ఆటగాళ్లకూ కనిపించడం లేదు. డబ్బే లక్ష్యంగా పని చేస్తోన్న బిసిసిఐ మితిమీరిన క్రికెట్ ఆడిస్తోంది. పొట్టి క్రికెట్(T-ట్వంటీ) మొదలయ్యాక ఏడాదిలో ఆడే మ్యాచ్ ల సంఖ్య భారీగా పెరిగింది. రొటేషన్ పద్ధతిలో ఆటగాళ్లకు అవకాశం కల్పించకుండా మన క్రికెట్ బోర్డు కొంతమంది ఆటగాళ్లతోనే నెట్టుకు వస్తోంది. భారీగా టోర్నీల సంఖ్య పెరగడంతో ఆటగాళ్లు అలిసి పోతున్నారు. మరో వైపు టోర్నీకి టోర్నీకి మధ్య గ్యాప్ ఎక్కువగా లేకపోవడంతో కొత్త సిరీస్ కు సన్నద్ధం అవడానికి ఆటగాళ్లకు అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుతం విదేశీ గడ్డపై ఘోర పరాభవాలకు ఇదే కారణంగా కనిపిస్తోంది. గత రెండు విదేశీ సిరీస్ లను పరిశీలిస్తే... దక్షిణాఫ్రికా గడ్డపై ఘోర పరాభవానికి, కీవిస్ లో ఓటమికి కారణం ముందస్తు ప్రాక్టీసు లేకపోవడమే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు విదేశాల్లో ఆడాలంటే 15 రోజుల ముందుగానే ఆదేశం వెళ్లి ప్రాక్టీస్ చేసి అక్కడి వాతావరణానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తాయి. మన జట్టు మాత్రం రెండు రోజుల ముందు వెళ్లి ప్రాక్టీసు లేకుండానే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడటం మొదలు పెడుతోంది. కాసుల వేటలో ఉన్న బిసిసిఐ విదేశీ గడ్డపై ఆడే సిరీస్ షెడ్యూలు ను ఆటగాళ్లకు అనుకూలంగా లేకుండా తయారు చేస్తోంది. ఇక రొటేషన్ పద్ధతిలో ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ దీర్ఘ కాలిక అవసరాలను చూడటంలోనూ క్రికెట్ బోర్డు విఫలమవుతోంది. ఒక్కసారే కొందరూ See more 

ఆక్సిజన్ లేకుండానే బతకొచ్చట..!

జీవి తొలినాళ్లలో ఆక్సిజన్ లేకుండా మనుగడ సాగించిందా..? ఇప్పుడున్న ఆక్సిజన్ స్థాయికి అప్పటి ఆక్సిజన్ స్థాయికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందా..? అత్యధిక ఆక్సిజన్ ఉంటేనే జీవుల మనుగడ సాగుతుంది అని చెబుతున్న జీవపరిణామా సిద్ధాంతాన్ని ఇప్పుడు తిరగరాయాలా..? అంటే అవునంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ శాస్త్రవేత్తలు.
           అయితే బాల్టిక్ సముద్రానికి చెందిన డానిష్ ఫోర్డ్ అనే ఓ ముఖ ద్వారం ప్రాంతంలో గల సముద్ర స్పంజికలపై జరిపిన పరిశోధనలో, అత్యధిక స్థాయి ఆక్జిజన్ లేకుండానే జీవి మనగలుగుతుందని తేలింది. ప్రస్తుతం వాతావరణంలో ఆక్సిజన్ శాతం 20. 95 ఉన్నది. ఇది 0.5 శాతం ఉన్నప్పటికీ జీవులు మనుగడ సాగించగలవని ఈ పరిశోధనలో తేలిందని సమాచారం.