Wednesday 30 April 2014

మైనింగ్ మాఫియాకు 'గల్లా'అండ.
galla aruna kumari, Mining ,sakshi, 01.05.14

జనం ఓటెత్తారు...తెలంగాణలో 72శాతం పోలింగ్

జనం ఓటెత్తారు...తెలంగాణలో 72శాతం పోలింగ్ 
                                                     elections2014, telangana, 01.05.14

చంద్రబాబును వదిలి రామోజీ దగుల్బాజీ రాతలు..సాక్షి స్పేషల్

చంద్రబాబును వదిలి  రామోజీ దగుల్బాజీ రాతలు..సాక్షి స్పేషల్ 
specials, sakshi, 01.05.14

అధినేతలు...ఉల్లంఘనలు!...

అధినేతలు...ఉల్లంఘనలు!...
specials, sakshi, 01.05.14

టీఆర్‌ఎస్‌లో నూతనోత్సాహం..

TRS


హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఎన్నికలు, కొత్త రాష్ట్రంలో మొదటి ఎన్నికల పోలింగ్ టీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జరిగిన పోలింగ్ సరళి, పెరిగిన పోలింగ్ శాతం ఆ పార్టీ విశ్వాసాన్ని మరింత పెంచింది. అధికార పగ్గాలపై ఆశలను రెట్టింపు చేసింది.
కాంగ్రెస్ నేతల కుదేలు..
         
కేసీఆర్ ఒంటరిగా పోటీ చేయడం ఆ పార్టీకి మైనస్ అని 40 సీట్లకు మించి రావనే చర్చ ఎన్నికల ప్రారంభంలో జరిగింది. కానీ రాజకీయ మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్ తన వ్యుహాలకు పదును పెట్టడం ఆ పార్టీకి ప్లస్ అయ్యింది. కాంగ్రెస్ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు కేసీఆర్ కౌంటర్ ఎటాక్ కు పొన్నాల, దామోదర లాంటి నేతలు మాట్లాడినా దిగదుడుపే అయ్యింది. చివరకి టీఆర్ఎస్ నుంచి కొందరు నేతలనూ చేర్చుకొని వారితో కేసీఆర్ ను తిట్టించినా కేసీఆర్ మాటల యుద్ధం ముందు కాంగ్రెస్ నేతలు బావురమన్నారు. వీటికి తోడు మూడో ఫ్రంట్ కు అనుకూలమని, మోడీ దుష్మన్ అంటూ చేసిన ప్రకటనలు, మైనార్టీల అండ తమ పార్టీకి పెరిగేందుకు తోడ్పడ్డాయనే భావన గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
కలిసొచ్చిన పవన్‌ వ్యాఖ్యలు..!
            
గతం వారం రోజులుగా తెరపైకి తెచ్చిన మోడీ యూటీ ప్రకటన కేసీఆర్ కు యూత్ లో మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందని విశ్లేషకులంటున్నారు.ఇక్కడ ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ హైదరాబాద్ ను యూటీ చేస్తానంటూ చంద్రబాబు ప్రకటన చేయిపిస్తారంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య యూత్ లో టీఆర్ఎస్ కు మరింత ఓట్లు తెచ్చిపెట్టాలా చేసి ఉండవచ్చనే అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్ ను కేసీఆర్ మీదకు బిజెపి, టీడీపీ నేతలు వదిలారు. కానీ పవన్ వ్యాఖ్యలు కేసీఆర్ కు మరింతగా ప్లస్ అయ్యాయని విశ్లేషకులంటున్నారు. మొత్తానికి పెరిగిన ఓటింగ్ శాతం యూత్ ఓటింగ్ లో పాల్గొన్నారనే సంకేతం పంపుతోంది. ఇది టీఆర్ఎస్ ఓటే కావొచ్చనే అనే చర్చ జరుగుతోంది.
టీఆర్‌ఎస్‌లో పెరిగిన ఆశలు..
       
టీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోనూ ఓటింగ్ శాతం పెరగడం పార్టీలో ఆశలు మరింత పెంచుతోంది. మొత్తానికి గులాబీ దళానికే అత్యధిక సీట్లు వస్తాయనే చర్చ అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ జరుగుతోంది. అయితే ఈవిఎంలో నిక్షిప్తమైన నేతల, పార్టీల తలరాత తెలుసుకోవాలంటే మరో పదిహేను రోజులు ఆగాల్సిందే.

సుపరిపాలన దిశగా...

సుపరిపాలన దిశగా...
specials, namasthe telangana, 01.05.14 

ఎన్నికలే ప్రజాస్వామ్యమా?...

ఎన్నికలే ప్రజాస్వామ్యమా?...
specials, namasthe telangana, 01.05.14

ఈవీఎంలలో భవిత

ఈవీఎంలలో భవిత
specials, namasthe telangana, 01.05.14

హంతకులను నిర్దోషులంటే ఎలా?

హంతకులను నిర్దోషులంటే ఎలా?
specials, prajasakshi, 01.05.14

మేడే దీక్ష

మేడే దీక్ష 
                                                              specials, prajasakthi, 01.05.14

కార్పొరేట్ల సేకుడి ఎంపిక కోసమేనా ఈ 'ఎన్నికలు'?

కార్పొరేట్ల సేకుడి ఎంపిక కోసమేనా ఈ 'ఎన్నికలు'?
specials, prajasakshi, 


చెన్నయ్ రైల్వేస్టేషన్ లో పేలుడు- ఒకరి మృతి

Bomb Blast 

చెన్నయ్: చెన్నయ్ సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం 7 గంటల 30 నిమిషాల ప్రాతంలోఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నయ్ రైల్వే స్టేషన్లోని 9వ నెంబర్ ఫ్లాట్ఫామ్ పై నిలిచి ఉన్న బెంగళూరు- గౌహతి ఎక్స్ప్రెస్ ఎస్-4 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రైల్వే పోలీసులు దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే స్టేషన్ లో పోలీసులు బాంబు స్వ్కాడ్ లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు పేలుడు నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు.

అరవైలో ఇరవై (పెళ్లికొడుకుగా డిగ్గీరాజా)..

Digvijaya Singh
ఢిల్లీ : ప్రేమకు ఏజ్ బార్ అడ్డంకి కాదని డిగ్గీరాజా రుజువు చేశారు. వయసెంత ముదిరినా తాను పెళ్లికి రెడీ అంటున్నారు. 67 ఏళ్ల వయసులో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. టీవీ యాంకర్ అమృతారాయ్ ని పెళ్లాడేందుకు ఆయన సిద్ధమయ్యారు. భార్య చనిపోయి ఏడాది గడవకుండానే ఇప్పుడాయన రెండో పెళ్లికి ముస్తాబవుతున్నాడు. నెట్ లో డిగ్గీరాజా, అమృతారాయ్ ల ప్రేమాయణ ఫొటోలు హల్ చల్ చేయడంతో విమర్శలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి తాము పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి దిగ్విజయ్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
గాసిప్స్ కి ఫుల్‌ స్టాప్ పెట్టిన డిగ్గీ...
          
అంతకంటే ముందు డిగ్గీరాజా, అమృతారాయ్ ఎఫైర్ ఇంటర్నెట్ లో, రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల సమయంలో ఈ ఫొటోలు బయటకు రావడంతో డిగ్గీ పరువు బజారున పడింది. బీజేపీ దీనిని అస్త్రంగా చేసుకునేందుకు సిద్ధమైంది. ఎన్నికల సమయం కావడంతో విపక్షాల విమర్శలకు తావిచ్చినట్లు అవుతుందని డిగ్గీ భావించారు. విమర్శలకు ఒక్క మాటతో ఫుల్‌ స్టాప్ పెట్టేశారు. ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాననంటూ తన మనసులోని కోరికను ట్విట్టర్ లో తెలిపాడు. అమృతారాయ్ తో సాన్నిహిత్యం ఉన్న మాట నిజమేనంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత వివాహం చేసుకుంటానని ట్విట్టర్ లో ప్రకటించారు. దీనికి అమృతాయ్ కూడా పెళ్లికి సుముఖత తెలిపినట్లు తెలిసింది. మొత్తం మీద డిగ్గీరాజా పెళ్లిపై వచ్చిన గాసిప్స్ కి ఎట్టకేలకు ఫుల్‌ స్టాప్ పెట్టారు. ఇటు ప్రత్యర్థులుకు అవకాశం ఇవ్వకుండా, పెళ్లికి ఎలాంటి ఇబ్బందీ ఉండకుండా దిగ్విజయ్ వ్యవహరించారని అతని సన్నిహితులు అంటున్నారు

నేడు మేడే..

May Day 10tv.in

హైదరాబాద్: మే 1 (నేడు) మేడే. పెట్టుబడిదారీ వర్గ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గం నినదించిన రోజు. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోయ్ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. సమాజగతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గం. అది చేస్తున్న నిరంతర శ్రమ. శ్రామికశక్తితోనే మానవ సంస్కృతి వికసించి ముందడుగు వేస్తోంది. కానీ ఆ శ్రమే బండచాకిరీగా మారినపుడు ఏమవుతుంది? శ్రామికుడు దారుణంగా దోపిడీకి గురైనపుడు ఏం జరుగుతుంది? కష్టించే చేతులు పిడికిళ్ళు బిగిస్తాయ్. భూకంపం సృష్టిస్తాయ్. ఉద్యమాలు పుట్టుకొస్తాయి.
130 ఏళ్ల క్రితమే కార్మికోద్యమం..
పెట్టుబడీదారీ ప్రపంచానికి పుట్టినిల్లైన అమెరికాలో దాదాపు 130 ఏళ్ళ క్రితం శ్రమ దోపిడీపై కార్మికులు ఉద్యమించారు. తరతరాల దోపిడీపై తిరుగుబాటు జరిగినపుడు చిందిన వెచ్చని నెత్తురే కేతనమై ఎగసింది.
అది అమెరికాలోని చికాగో నగరం..1886 మే 1
    
అమెరికాలోని చికాగోలో కార్మికులు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్న రోజులవి. కార్మికులు రోజుకి 18-20 గంటలు పనిచేస్తున్న దోపిడీ కాలమది. పారిశ్రామిక విప్లవం ప్రారంభదినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమించే వారు. పారిశ్రామికవేత్తలు అధిక లాభాలకోసం ఆరేడేళ్ళ పిల్లలతోనూ, మహిళలతనూ ఫ్యాక్టరీల్లో, గనుల్లో పనిచేయించారు. కార్మికులు చాకిరీ కొలిమిలో కుతకుతలాడిపోయిన సందర్భమది.
         ఆ దోపిడీ రాపిడిలోంచి తిరుగుబాటు అగ్గి రాజుకుంది. రోజుకి ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో కార్మికుల 1886 మే 1 ఉద్యమించారు. ఆ రోజు కార్మికవర్గ చైతన్యం వెల్లివిరిసింది. చికాగో నగర వీధుల్లో ఉత్సాహవంతులైన కార్మికుల కదం తొక్కారు. మూడున్నర లక్షలమంది కార్మికులు పోరాటబాట పట్టిన సార్వత్రిక సమ్మె అది. ఆ ఉద్యమం ప్రపంచవ్యాపితమై పెల్లుబికింది. అదే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే గా ప్రసిద్ధి కెక్కింది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మిక వర్గ చైతాన్యాన్ని ఏవిధంగానైనా నాశనం చేయాలని పెట్టుబడిదారి వర్గం నిర్ణయించుకుంది. దానికి ప్రభుత్వం అండగా నిలిచింది.
       అదే ఏడాది మే 3న శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మిక జనసమూహంపై అమెరికన్‌ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. ఈ దారుణ హత్యాకాండకు నిరసనగా మే 4న హే మార్కెట్‌లో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రశాంతంగా సాగుతున్న సభ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. మధ్యలో బాంబు ప్రయోగం కూడా జరిగింది. ఒక పోలీసు సార్జెంట్‌ చనిపోయాడు. అది సాకుగా తీసుకుని పోలీసులు నిరాయుధులైన కార్మికులపై తుపాకులతో స్వైర విహారం చేశారు. ఈ సంఘర్షణలో ఏడుగులు పోలీసులు చనిపోగా నలుగురు కార్మికులు నేలకొరిగారు. హే మార్కెట్‌ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిసిపోయింది. అక్కడే ఆవిర్భవించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాడి శ్రమజీవుల స్వేచ్ఛా సంకేతమైన అరుణపతాకం.
           ఏ దేశంలోనైనా సమాజామార్పునకు చోదక శక్తి కార్మికవర్గమే. మనలాంటి వెనుకబడిన దేశాల్లో కార్మికులకు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజంలోని ఇతర వర్గాలను కలుపుకుని ఉద్యమాలను పటిష్టం చేయాల్సి ఉంటుంది. గ్రామీణ భారతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, కూలీల వలసలు, ఇతర సమస్యలపై ఉద్యమాలను నిర్మించాల్సి ఉంటుంది. రైతులతో ఇతర వర్గాలతో కార్మికులు భుజం,భుజం కలిపి పోరాడాల్సి ఉంటుంది. మెరుగైన సమాజం కోసం శ్రామికవర్గం దీక్ష పూనాలి. ఆ మహత్తర సంకల్పంతోనే ముందుకుసాగాలి.

మోడీపై కేసు నమోదుకు ఈసీ ఆదేశాలు..




అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కేసు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అహ్మదాబాద్ లో ఓటు వేసిన మోడీ..ఎన్నికల గుర్తు కమలం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్ ప్రకారం పోలింగ్ బూత్ కు వంద మీటర్ల లోపు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఎన్నికల గుర్తు చూపడంతో పాటు ప్రసంగించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ పేర్కొంది.

తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు- రాఘవులు

bv raghavulu



హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషదాయకమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుక్ను ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోని తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని సూచించారు.