ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 లోక్ సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విడిపోయింది. అయితే.. వివిధ రకాల ముసుగులు వేసుకుని విభజన కార్యాన్ని పూర్తిచేసిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి పార్టీల ఇందులో వాటా ఎంత..? మొదటి నుంచీ తమ స్వార్థ, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో నాటకాలు ఆడిన ఈ పార్టీలు.. తుది వరకూ ఆటను కొనసాగించాయి. చివరకు.. ప్రజలు ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో కూడా తేల్చుకోలేని గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. కేవలం ఓట్లు, సీట్లు కోసమే జరిగిన రాష్ట్ర విభజన తంతులో ఎవరి వాటా ఎంతుందో..
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ లక్ష్యం... రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సీమాంధ్రలో తమకు కొరకరాని కొయ్యగా మారిన జగన్ ను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీంతో.. మిగిలిన తెలంగాణలోనైనా పట్టు నిలుపుకోవాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో...See More
No comments:
Post a Comment