Friday 14 March 2014

కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో : పవన్

pawan kalyan at party announcement.

భారతదేశ సమగ్రతను విచ్ఛిన్నం చేస్తూ... దేశాన్నే సర్వ నాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, తద్వారా దేశాన్ని రక్షించుకోవాలని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతను నాశనం చేస్తున్నాయని విమర్శించారు...
రాష్ట్ర విభజనకు పాలకులే కారణం...
 
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవడానికి దశాబ్దాల తరబడి పాలించిన పాలకులే కారణమని పవన్ కళ్యాణ్వి మర్శించారు. సమస్య ను మొగ్గలోనే తుంచకుండా తమ అవసరాలకోసం వాడుకున్నారని అన్నారు. ఫలితంగానే అది ముదిరి నేడు రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి కారణమైందని చెప్పారు. దీనికి పూర్తిగా రాష్ట్రాన్ని పాలించిన వారే బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.
విభజనతో దేశ సమగ్రతకు భంగం...
 
ప్రాంతాల వారీగా జరిగే విభజనలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసమే ఆంధ్రప్రదేశ్ ను విభజించిందని అన్నారు. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనే అయితే.. 2009లోనే ఎందుకు రాష్ట్రాన్ని విభజించలేదని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు కాలయాపన చేసి, పార్లమెంట్ చివరి సెషన్ లో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో ఎందుకు విభజించాల్సి వచ్చిందని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
నేను భారతీయున్ని...
 
తాను భారతీయున్నని, తనకు కులం, మతం, ప్రాంతం లేవని పవన్ చెప్పారు. తనను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తినని అంటే బాధగా ఉంటుందని అన్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విడదీసినప్పటికీ.. ప్రజల్ని మాత్రం విడదీయొద్దని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్ర ప్రాంతంపై విద్వేషాలు పెంచడం సరికాదని, తెలంగాణ అభివృద్ధి కోసం విధానాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రం విడిపోతే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన వారు.. ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారో.. తెలంగాణలోని రైతులందరికీ చెప్పాలని, అప్పుడు అందరూ అభివృద్ధి చెందుతారని పరోక్షంగా కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రజల మధ్య ద్వేషం పెంచే ప్రయత్నం...
 
రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం జరుగుతోందని పవన్ అన్నారు. ఇందుకోసం కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ పద్ధతిని విరమించుకోవాలని హెచ్చరించారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య సుహృద్భావం పెంచేందుకు జనసేన పాటుపడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి.. ప్రజలుగా కలిసుండాలని, రెండు రాష్ట్రాలూ అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ దిశగా జనసేన కృషి చేస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ వల్లే అన్నయ్యకు ఎదురుగా...
 
అన్నయ్య చిరంజీవికి తాను ఎదురుగా నిలబడడం లేదని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలోనే.. తప్పక ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అన్నయ్య అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు.
మూడోపెళ్లి నా వ్యక్తిగతం..
 
తన మూడో పెళ్లి గురించి పవన్ మాట్లాడుతూ... ...see more..

No comments:

Post a Comment