Friday 14 March 2014

'ఎన్నికల' కోసమే 'విభజన' - పవన్




హైదరాబాద్ : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఢిల్లీ పెద్దలు.. ఇప్పుడు విభజన నిర్ణయం తీసుకున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తెలంగాణ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే.. 2009లోనే ఇచ్చిఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. అలా చేసిఉంటే.. 1000 మంది యువకులు ఆత్మహత్య చేసుకునే వారు కాదని తెలిపారు. సోనియా, రాహుల్ పద్దతి ప్రకారం ఇరు ప్రాంతాల వారితో మాట్లాడి ఉండాల్సిందన్నారు. విభజన విషయంలో అధిష్టానం స్వార్థ పూరితంగా వ్యవహరించిందని, కేవలం 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేసిందని చెప్పారు. తెలుగు వారికి ఢిల్లీ నేతలు ఎప్పుడూ విలువ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment