|
pawan kalyan 10tv |
హైదరాబాద్: తాను 7 వ తరగతి చదువుతున్నపుడు చూసిన ఘటన వల్లే తనలో సామాజిక స్పృ హ పెరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. సామాన్యుడు ఏవిధంగా బాధపడుతాడో తనకు ఆరోజే తెలిసిందని చెప్పారు. లోకంలోని మనుషులంతా మనసులో ఒక మాట నోటి నుంచి ఒక మాట మాట్లాడుతారని అన్నారు. సమాజంలో సామాన్యులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జీవితంలో ప్రతీ చోట తనకు సమస్యలే కనిపించేవని అన్నారు. తనలో మెదిలిన ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు విప్లవ సాహిత్యం, తెలంగాణ సాయుధపోరాటం గురించి చదివానని చెప్పారు. తనలో తిరుగుబాటు తత్వం ఎప్పటికీ పోదని అన్నారు. సమాజంపై కోపంతో మార్షల్ ఆర్ట్స్ , యోగ నేర్చుకున్నానని అప్పటికీ తన మదిలో మెదిలిన ప్రశ్నలకు సమాధానం లభించేది కాదని, నిరాశ, నిశ్పృహతో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించానని చెప్పారు. తన జీవితంలో ప్రవేశించిన అమ్మాయిలు తన మనసు మార్చారని అన్నారు.సమాజం పట్ల, దేశం పట్ల పోరాటం చేయాలని తాను వేసుకున్న ప్రశ్నే తనను ప్రజల ముందు నిలబెట్టిందని అన్నారు.
No comments:
Post a Comment