pawan kalyan 10tv |
హైదరాబాద్ : రాష్ట్రాన్ని పాలించిన నేతలంతా విభజనకు బాధ్యత వహించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు రాష్ట్ర విభజన పాపం నేతలందరిదనీ ఆయన పేర్కొన్నారు. నేతలకు.. డబ్బులు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ దేశంపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కారం జరిగి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజకీయ నాయకుల పాపం వల్లే ఇరు ప్రాంతాల సామాన్యులు కొట్టుకునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితికి కారణమైన నేతలంతా బయట మాత్రం కలిసి మెలిసే తిరుగుతున్నారని పేర్కొన్నారు.
No comments:
Post a Comment