Friday 28 February 2014

మనం ఇద్దరం.. మనకు ఐదుగురు..! (హిందూ జంటలు ఐదుగుర్ని కనాలన్న విహెచ్ పి..!!)


ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కాషాయం మతోన్మాదం ఏ స్థాయిలో జడలు విప్పుతోందో.. తెలుసుకోవడానికి చక్కని ఉదాహరణ ఈ వ్యాఖ్యలు..! మతతత్వ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 'హిందూ' కార్డును ఎన్ని రూపాల్లో వీలైతే అన్ని రూపాల్లోనూ జనంలోకి చొప్పించే ప్రయత్నం జరుగుతోంది.. అది ఏ స్థాయిలో ఉందో విశ్వహిందూ పరిషత్ కన్వీనర్ అశోక్ సింఘాల్ మాటలు మన కళ్లకు కడుతున్నాయి..!! భారత దేశంలోని ప్రతి హిందూ జంట ఇక నుంచి ఐదుగురు సంతానాన్ని కనాలట! ఒక్కరిద్దరితో అసలే ఆగిపోకూడదట..!!

ఎందుకంటే..? 
పై వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో అశోక్ సింఘాల్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ కూడా ఇచ్చారు. దేశంలో రోజురోజుకీ హిందువుల సంఖ్య తగ్గిపోతోందట..! ఈ తగ్గుదల ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భారతదేశంలో హిందువులు మైనారిటీ స్థాయికి పడిపోతారట..! ఈ వివరణతో ఆగకుండా ఇతర మతాలపైనా నోరు పారేసుకున్నారు. ఇతర మతస్తులు తమ జనాభాను పెంచుకుంటూ పోతున్నారని చెప్పారు. ఈశాన్య భారతదేశంలో క్రైస్తవులు ముక్తిసేన పేరిట మారణకాండ సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తుపాకులతో బెదిరించి మరీ క్రైస్తవ మతంలోకి దింపుతున్నారని అన్నారు. ఈ కారణాల వల్ల ఇబ్బందుల్లో పడుతున్న హిందూ మతాన్ని రక్షించాలంటే హిందూ దంపతులంతా అలర్ట్ కావాలని ఉద్భోదించారు. ఇక నుంచీ అందరూ ఐదుగురు పిల్లలను కనాలని తేల్చేశారు.

ప్రస్తుత.. జనాభా 120 కోట్ల పైనే..!
ప్రస్తుతం మన దేశ జనాభా నూట ఇరవై కోట్ల పైనే ఉంది. పెరిగిపోతున్న జనాభా కారణంగా ఆహారం, నివాసం, ఉపాధి తదితర అనేక సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇది ఒక్క మనదేశాన్నే కాదు.. అన్ని దేశాలనూ అవస్థల పాల్జేస్తున్న విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఒక జంట ఒక్కరినే కనాలని, తద్వారా దేశ అభివృద్ధికి పాటుపడాలని నిబంధనలు రూపొందిస్తున్నాయి. ఇవన్నీ పట్టించుకోని మతోన్మాధులు.. తమ పబ్బం గడుపుకునేందుకు మతం పేరిట దేశానికి హానిచేసే ప్రకటనలు చేస్తున్నారని లౌకిక వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment