Friday 28 February 2014

గంగూలీని బెదిరించిన సచిన్..! (గ్రౌండ్ చుట్టూ రౌండ్లు కొట్టిన సౌరవ్)


భారత క్రికెట్ లోనే కాకుండా ప్రపంచ క్రికెట్ లో సచిన్ స్థానం ఎవరెస్ట్. ఈ విషయం ఎవరూ కాదనలేని సత్యం. అయితే.. కెరీర్లో ఎవ్వరూ అందుకోలేని రికార్డులను తన ఖాతాలో లిఖించుకున్న మాస్టర్.. కెప్టెన్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అతని కెప్టెన్సీలో గతంలో ఓసారి టీమిండియా విండీస్ కు వెళ్లింది. ఆ పర్యటనలో మూడో టెస్టులో 38 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో.. టీం సభ్యులపై సచిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట..! ఈ నేపథ్యంలో.. 'ఇప్పుడు ఏం చేయమంటావు సచిన్?' అంటూ గంగూలీ ప్రశ్నించాడట. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న సచిన్.. 'రేపు ఉదయాన్నే లేచి గ్రౌండ్ చుట్టూ రౌండ్లు కొట్టు' అని ఆదేశించాడట! కానీ.. అప్పటికే జట్టులో ప్రధాన సభ్యుల జాబితాలో ఉన్న గంగూలీ.. 'సరేగని పోవోయ్..' అన్నట్టు వ్యహరించి తర్వాతి రోజు హోటల్ గదికే పరిమితమయ్యాడు. దీంతో.. తన ఆదేశాలు పాటించలేదని మరింత కోపం తెచ్చుకున్న సచిన్.. టూర్ మధ్యలోనే సౌరవ్ ను భారత్ కు పంపేయాలని నిర్ణయించుకున్నాడట! అదే జరిగితే తన కెరీర్ కు బ్రేక్ పడుతుందని భావించిన దాదా... మరుసటి రోజు ఉదయాన్నే కాళ్ళకు షూ తగిలించుకుని మైదానం చుట్టూ పరుగులు పెట్టాడట. ఈ విషయం ఇప్పుడెలా బయట పడిందనేగా మీ సందేహం..? ఆనాటి ఘటనను గంగూలీ ఓ పుస్తకంలో పేర్కొన్నాడు. అందులో... కెప్టెన్ ఆజ్ఞను పాటించకపోవడం తన తప్పేనని ఒప్పుకున్న దాదా.. సచిన్ తాను మాట వినలేదన్న కోపంలో రాయడానికి వీల్లేని భాషలో హెచ్చరించాడని వెల్లడించాడు.

No comments:

Post a Comment