Thursday 1 May 2014

జగన్ సీమాంధ్రలో పుట్టలేదా ? - పవన్ కల్యాణ్..

pawan kalyan


నెల్లూరు : నేతల మధ్య తిట్ల పురాణం తారాస్థాయికి చేరుకొంటోంది. తెలంగాణ ఎన్నికలు పూర్తవగానే వివిధ పార్టీల నేతలు సీమాంధ్రలో ప్రచారం చేపడుతున్నారు. ఎన్డీయే నిర్వహిస్తున్న సభలో పాల్గొంటున్న చంద్రబాబు, పవన్ లు ఎక్కువగా కేసీఆర్, జగన్ లను టార్గెట్ చేస్తూ ప్రసంగిస్తున్నారు. గురువారం నెల్లూరు జిల్లాలోని ఎసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు పాల్గొన్నారు. ఈ సభలో పవన్ ఆవేశంగా ప్రసంగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నించారు. సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న జగన్ కు పౌరుషం లేదా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతాన్ని తిడుతున్న జగన్ ఎందుకు స్పందించడం లేదని..సీమాంధ్రలో పుట్టలేదా అంటూ ఆవేశంగా ప్రసంగించారు. తెలుగు జాతిని విచ్చిన్నం చేస్తే బాధ కలిగిందని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ఆత్మ గౌరవాన్ని కాపాడలేని నువ్వు సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి కాలేవు అంటూ జగన్ ను ఉద్ధేశించి పవన్ వ్యాఖ్యలు చేశారు.

No comments:

Post a Comment