Thursday 1 May 2014

స్వాతి ఇంట్లో విషాదఛాయలు..

Swathi 

గుంటూరు : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గౌహతి ఎక్స్ ప్రెస్ లో బాంబు పేలుళ్లలో మృతి చెందిన గుంటూరు వాసి స్వాతి (22) ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వాతి చెన్నై టీసీఎస్ లో సాఫ్ట వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. సమాచారం తెలుసుకున్న స్వాతి కుటుంబసభ్యులు చెన్నై బయలుదేరి వెళ్లారు.
స్వాతి జెన్టీయూ క్యాంపస్ సెలక్షన్ లో సెలక్ట్ అయ్యిందని స్వాతి అమ్మమ్మ, తాతయ్య రోదిస్తూ పేర్కొన్నారు. ఆమె చాలా బ్రిలియంట్ అని, చిత్రలేఖనంతో పాటు సంగీతం కూడా వచ్చని కన్నీళ్లు పెట్టుకున్నారు. గుంటూరుకు నేరుగా టికెట్ రాకపోవడంతో గౌహతి ఎక్స్ ప్రెస్ లో వయా చెన్నై మీదుగా బయలుదేరిందని తెలుస్తోంది. పెళ్లి చూపుల కోసమే స్వాతి గుంటూరు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇంతలోనే బాంబు పేలుళ్ల రూపంలో ఆమెను మృత్యువు కబళించిందని స్వాతి బంధువులు రోదించారు.

No comments:

Post a Comment