Wednesday 30 April 2014

చెన్నయ్ రైల్వేస్టేషన్ లో పేలుడు- ఒకరి మృతి

Bomb Blast 

చెన్నయ్: చెన్నయ్ సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం 7 గంటల 30 నిమిషాల ప్రాతంలోఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నయ్ రైల్వే స్టేషన్లోని 9వ నెంబర్ ఫ్లాట్ఫామ్ పై నిలిచి ఉన్న బెంగళూరు- గౌహతి ఎక్స్ప్రెస్ ఎస్-4 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రైల్వే పోలీసులు దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే స్టేషన్ లో పోలీసులు బాంబు స్వ్కాడ్ లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు పేలుడు నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు.

No comments:

Post a Comment