 |
Pawan kalyan www.10tv.in
|
హైదరాబాద్ : '' రాజకీయ నాయకులు నాపై విమర్శలు చేస్తే నేను భయపడను. పిరికితనం అంటే నాకు చిరాకు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ వెన్నుచూపను'' అని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చెప్పారు. తాను రాజకీయ పార్టీ పెడుతున్నానంటే అనేక మంది రకరకాల విమర్శలు చేశారని తెలిపారు. పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో కలపాలని దిగ్విజయ్ కోరినట్లు చెప్పారు. అలా కలిపేందుకు కాంగ్రెస్ ఏమైనా గంగానదా..? అని ప్రశ్నించారు. తాను పార్టీ పెడుతున్నట్లు ఇటీవల వార్తలొస్తుంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గంగిరెద్దుల మాదిరిగా కొత్త దుకాణం పెడుతున్నారని చేసిన కామెంట్ కు పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment