 |
| pawan kalyan 10tv |
హైదరాబాద్ : రాష్ర్ట విభజన తీరు తనకు నచ్చలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ర్ట విభజన విషయంలో బిజెపి నేత వెంకయ్య నాయుడు సీమాంధ్ర ప్రజల కోసం చేసిన ప్రయత్నం తనకు నచ్చిందన్నారు. అందుకే వెంకయ్యనాయుడు అంటే తనకు చాలా ఇష్టమని ప్రసంశించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని అడుగుతుంటే కేంద్ర మంత్రి జయరాం రమేశ్ కొసరి కొసరి కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల్లోని నాయకులతో తనకు వ్యక్తిగతంగా పరిచయాలున్నాయని అయితే... వారంటే తనకు ఎలాంటి అయిష్టం లేదని తెలిపారు. వారి సిద్ధాంతాలు వేరు, తన సిద్ధాంతాలు వేరని వివరించారు. వారి సిద్ధాంతాలతో తాను ఏకీభవించలేనన్నారు. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని తెలిపారు.
No comments:
Post a Comment