 |
| pawan kalyan 10tv |
హైదరాబాద్ : తనను 'ఆంధ్రోడు' అంటే చాలా బాధగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు ఆంధ్రా, తెలంగాణ అనే తేడా లేదని.. తాను భారతీయుడినని పేర్కొన్నారు. అలాగే తనకు కులం, మతం అనే తేడా కూడా లేదని స్పష్టం చేశారు. భాష కన్నా భావం ముఖ్యమని.. గురజాడ, శ్రీశ్రీ ల్లో ఎవరు గొప్ప అనే పరిస్థితి రాకూడదని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విడదీసినా.. ప్రజల్ని విడదీస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. కెసిఆర్ మాటలు ఫ్యూడల్ దురహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన కెసిఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణలోని రైతులందరికీ అదే విధానాన్ని నేర్పాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి కోసం విధానాలు రూపొందించాలన్నారు
No comments:
Post a Comment